సాధారణంగా విమానం ఎక్కే ముందు ఎయిర్ లైన్స్ ఇచ్చే రూల్స్ లో ప్రయాణికుల ఆరోగ్య రక్షణ మా బాధ్యత కాదు. ఎవరికి వారు సంరక్షించుకోవాలని ఉంటుంది. అందుకే విమానయాన సంస్థలు సాధారణంగా విమానంలో సంభవించే మరణాలకు బాధ్యత వహించవు. అయితే వారి నిర్లక్ష్యం వల్ల ప్యాసింజర్ చనిపోతే కచ్చితంగా వారికి బాధ్యత ఉంటుంది. కాని మినిమం రెస్పాన్సిబులిటీ తీసుకుంటాయి. అంటే.. అనుకోకుండా విమానం ఎక్కిన తర్వాత ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణిస్తే, ఫ్లైట్ అటెండెంట్ వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. అప్పుడు విమానంలో ఎవరైనా డాక్టర్లు లేదా వైద్య నిపుణులు ఉంటే వారి సహాయం తీసుకుంటారు. ప్యాసింజర్ ని కాపాడటానికి ప్రయత్నిస్తారు.
విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోతే విమాన సిబ్బంది ఎవరూ కూడా ప్రయాణికుడు చనిపోయాడని ప్రకటించలేరు. ఈ విషయాన్ని అధికారిక వైద్యులు లేదా వైద్య నిపుణులు మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. ఫ్లైట్లో వైద్యులు ఎవరూ లేకపోతే, ఎవరైనా చనిపోయినప్పుడు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందిస్తారు. వారి నిర్ణయంపై విమాన ప్రయాణం ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి మధురై నుండి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసు: టికెట్ ధర ఇంత తక్కువా?
ఒకవేళ ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంటే సమీప విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయవచ్చు. ప్రయాణికుడు అప్పటికే మరణించి ఉంటే, ఆ విషయాన్ని విమానంలో ఉన్న ఎవరైనా డాక్టర్లు నిర్ధారిస్తే ల్యాండింగ్ చేయడానికి లేదు.
మరి ఆ శవాన్ని అలాగే ఉంచి విమానం గమ్యస్థానం చేరుకొనే వరకు ప్రయాణించాల్సిందేనా అంటే.. అవసరం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని హైటెక్ విమానాలలో కార్ప్స్ లాకర్ అనే ప్లేస్ ఉంటుంది. ఇలా ఎవరైనా విమానం గాల్లో ఉండగా చనిపోతే ఆ శవాన్ని గౌరవంగా కార్ప్స్ లాకర్ లో ఉంచుతారు. అది లేని విమానాల్లో సిబ్బంది వచ్చి ఆ శవాన్ని ప్రయాణికులకు దూరంగా ఖాళీ సీటులో ఉంచుతారు. లేదా బిజినెస్ క్లాస్లో పడుకోబెడతారు.
ఒక్కో సారి మృతుల పక్కన కూర్చున్న ప్రయాణికులను అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే సీట్ లో కూర్చోబెడతారు. కానీ చాలా సందర్భాలలో వ్యక్తి చనిపోతే ఆ శవంతోనే మిగిలిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
విమానం ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయ అధికారులు, వైద్య సిబ్బందికి ప్రయాణికుడి మరణం గురించి సమాచారం ఇస్తారు. తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలియజేస్తారు. చట్ట ప్రకారం ఫార్మాలిటీస్ పూర్తి చేసి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.
విమానంలో మరణం జరగడం చాలా అరుదు. ఎందుకంటే ప్రతి ఎయిర్ లైన్ కచ్చితంగా ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తాయి. అనుకోకుండా జరిగే సంఘటనలకు ఎవరూ బాధ్యత వహించలేరు. కానీ ఇటీవల సౌదీ అరేబియా నుండి లక్నో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న బీహార్ కు చెందిన వ్యక్తి ఒకరు మరణించారు. దీంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఫ్లైయిట్ ల్యాండ్ అయిన తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేశారు.