ఈ ఏడాది కూడా సింగపూర్ తన మొదటి స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకుంది. జపాన్, దక్షిణ కొరియా కూడా టాప్ ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. చాలా యూరోపియన్ దేశాలు కూడా ఉన్నత ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ దేశాల పాస్పోర్టులకు ప్రపంచవ్యాప్తంగా తిరిగే ప్రయాణ స్వేచ్ఛ ఉంటుంది.
భారత్ ప్రస్తుతం 75వ ర్యాంకులో ఉంది. 2006లో నాటి 71వ ర్యాంక్ ఉండేది. కానీ తరువాత 85 వ ర్యాంకుకు చేరింది. ఇప్పుడు గతేడాదితో పోలిస్తే మళ్లీ ర్యాంకును తగ్గించుకుని పాస్ట్ పోర్టు విలువను పెంచుకుంది. ఇది భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణ అవకాశాలు మెరుగుపడుతున్నాయని చూపిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలు వీసా మినహాయింపు ఇస్తే, భారత పాస్పోర్ట్ బలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.