ఇండియా ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్కిల్ ఉంటే డబ్బు వేగంగా సంపాదించే ఉపాధి మార్గాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగాలు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. రోడ్డు, రైల్వే, విమానం, సముద్రయానం, ట్రావెల్, ఇలా అనేక రంగాల్లో ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెడుతూ ప్రజలకు ఉపాధి కల్పించడం ద్వారా ఆయా కంపెనీలు రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. ఇలా కొన్ని ప్రపంచ దిగ్గజ కంపెనీలుగా కూడా ఎదిగాయి. అలాంటి టాప్ కంపెనీలను నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తుల వద్ద ఆస్తి విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.