రూల్స్ పాటించకపోతే ఫైన్ రూ.వేలల్లోనే..
రోడ్డు ప్రమాదాల వల్ల ఈజీగా ప్రాణాలు పోతున్నాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి కారణమవుతోంది. కుటుంబ సభ్యులను పోగొట్టుకొని ఆ కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన నేరాలను అరికట్టడమే లక్ష్యంగా కఠినమైన ట్రాఫిక్ రూల్స్ అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
కొత్త రూల్స్ ప్రకారం శిక్షలు ఎలా ఉన్నాయంటే..
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ మొదటి సారి పట్టుబడితే వారికి రూ.10,000 జరిమానా విధిస్తారు. లేదా ఆరు నెలల జైలు శిక్ష వేస్తారు.
ఇదేవిధంగా రెండో సారి దొరికితే రూ.15,000 జరిమానా, రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.
రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే ఇప్పటి వరకు రూ.500 ఫైన్ వేసేవారు. ఇ-చలానా ఫోన్ కి లేదా మొయిల్ కి వచ్చేది. ఇకపై రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే రూ.5,000 ఫైన్ కట్టాలి.