విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం, గ్రామీణాభివృద్ధి, గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడం, పెద్ద ఆరోగ్య, విద్యా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశాభివృద్ధికి ముఖేష్, నీతా అంబానీ దంపతులు కృషి చేశారు. అంతేకాకుండా వ్యవసాయం, మహిళా ఉపాధి, నీటి సంరక్షణ, పాఠశాల మౌలిక సదుపాయాలు, కంటి సంరక్షణ, ఆసుపత్రుల నిర్మాణం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా లక్షలాది మంది భారతీయులు ప్రయోజనం పొందారు.