ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఫోన్ ద్వారా డబ్బు పంపడం, బ్యాలెన్స్ చెక్ చేయడం సాధారణంగా మారింది. కానీ ఆగస్టు 1 నుంచి UPI వినియోగంలో కొన్ని మార్పులు జరిగాయి:
* రోజుకు 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసే అవకాశం: ఇప్పుడు మీరు UPI ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ను గరిష్టంగా 50 సార్లు మాత్రమే చెక్ చేయగలరు.
* లింక్ చేసిన ఖాతాలకు పరిమితి: ఒక ఖాతాను UPIకి లింక్ చేసినట్లయితే, ఆ ఖాతా బ్యాలెన్స్ను రోజుకు 25 సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు.
* షెడ్యూల్డ్ పేమెంట్స్లో మార్పు: EMIలు, సబ్స్క్రిప్షన్ ఫీజులు వంటి ఆటోమేటిక్ చెల్లింపుల కోసం షెడ్యూల్ చేసే సమయాలను మూడు స్లాట్లుగా విభజించారు. దీని వల్ల ఒకేసారి అధిక లావాదేవీలు జరగడం తగ్గి, సిస్టమ్పై లోడ్ తగ్గుతుంది.
యూపీఐ రూల్స్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.