టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియోది సక్సెస్ ఫుల్ జర్నీ. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన ఈ టెలికాం దిగ్గజం సరసమైన ధరలకే అత్యుత్తమ సేవలు అందిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది జియో. అందుకే జియో దేశవ్యాప్తంగా 49 కోట్లకు పైగా వినియోగదారుల నమ్మకాన్ని పొందగలిగింది.
ఇతర ప్రైవేట్, ప్రభుత్వ టెలికాం కంపనీలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ నుండి తీవ్ర పోటీని తట్టుకుని మరీ మార్కెట్ రారాజుగా నిలిచింది. జియో సక్సెస్ సీక్రెట్ తక్కువ ధర ప్లాన్లతో వినియోగదారులను మెరుగైన సేవలు అందించడమే.
ఇలా తాజాగా మరో అద్భుతమైన ప్లాన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది జియో. ఆ ప్లాన్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.