Gold : తులం బంగారం 2 లక్షలు అవుతుంది.. ఎందుకో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే

Published : Oct 03, 2025, 09:43 PM IST

Gold Price Surge Explained: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ లెక్కలు చూస్తుంటే పసిడి పరుగులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. లక్షకు పైగా చేరిన బంగారం ధరలు త్వరలోనే తులం రూ.2 లక్షలు అవుతుందని అంచనాలున్నాయి. కారణాలు ఏంటో తెలుసుకుందాం.

PREV
16
గోల్డ్ మార్కెట్ పై అంతర్జాతీయ ప్రభావం

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఏడాది కాలంలోనే గోల్డ్ ధరలు డబుల్ అయ్యాయి. ఇంతటితో ఆగకుండా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నెలల్లోనే తులం బంగారం ధరలు రెండు లక్షల రూపాయలు అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు గమనిస్తే 24 క్యారెట్లు తులం సుమారు రూ.1.20 లక్షలుగా ఉంది. బంగారం ధరలు ఇంతలా పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

ప్రపంచ గోల్డ్ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్న పరిస్థితులు భారత్‌లోని బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతాయి. అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో డాలర్ విలువ, ఆర్థిక పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ విధానాల ప్రభావం, బంగారం ధరలను పెరిగేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరగడం వలన భారత మార్కెట్‌లో కూడా ధరలు పెరుగుతున్నాయి.

26
బంగారం ధరల పై డీ-డాలరైజేషన్, సెంట్రల్ బ్యాంకుల ప్రభావం

డీ-డాలరైజేషన్ కారణంగా, చైనా, రష్యా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ ఆధారిత ఆస్తులపై ఆధారపడకుండా, ఫారిన్ రిజర్వ్‌లో బంగారం నిల్వను పెంచుతున్నారు. దీని కారణంగా బంగారం ధరలు గ్లోబల్ స్థాయిలో పెరుగుతాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోలు ప్రత్యేకంగా భవిష్యత్ ఆర్థిక అస్థిరత నుండి రక్షణగా భావించడమే దీనికి కారణాలుగా ఉన్నాయి.

36
గోల్డ్ పై జియోపాలిటికల్ టెన్షన్‌ల ప్రభావం

యుద్ధాలు, సరిహద్దు ఘర్షణలు, దేశాల వ్యూహాత్మక విరోధాలు, మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్-రష్యా ఘర్షణలు, చైనా-తైవాన్ అనిశ్చితి వంటి పరిస్థితులు పెట్టుబడిదారులను సేఫ్-హేవెన్ ఆస్తుల వైపు మళ్లిస్తాయి. ఫలితంగా బంగారం పై డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు కూడా మరింతగా పెరుగుతున్నాయి.

46
గోల్డ్ పై లిమిటెడ్ సప్లై ప్రభావం

బంగారం పరిమితంగా లభ్యమవుతుంది. కొత్త మైనింగ్ తవ్వకాలు పెరగలేదు. బంగారం అరుదైన ఆస్తి కావడంతో, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఆటోమాటిక్‌గా పెరుగుతాయి. మైనింగ్ సాంకేతిక పరిమితులు, సస్టైనబుల్ ఉత్పత్తి విధానాలు కూడా గోల్డ్ సరఫరాను పరిమితం చేస్తాయి. ఇది ధరల పెరుగుదలకు కారణంగా ఉంటుంది.

56
కరెన్సీ డెవాలివేషన్, ద్రవ్యోల్బణ ప్రభావం

దేశీయ కరెన్సీ విలువ డాలర్ లేదా ప్రధాన కరెన్సీలతో పోలిస్తే పడిపోతే, బంగారం లోకల్ కరెన్సీలో ఎక్కువ ఖరీదు అవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగడం వల్ల బంగారం ఇన్‌ఫ్లేషన్ హెడ్జ్ గా భావిస్తారు. పెట్టుబడిదారులు లోకల్, అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు చేస్తారు, తద్వారా ధరలు పెరుగుతాయి.

66
గోల్డ్ పై యూఎస్ డెఫిసిట్, అంతర్జాతీయ ఆర్థిక ప్రభావం

అమెరికా డెఫిసిట్, నేషనల్ డెబ్ట్ అధికంగా ఉన్నప్పుడు, డాలర్ బలహీన పడుతుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు సేఫ్-హేవెన్ ఆస్తులలో డబ్బు పెట్టడం పెరుగుతుంది. అమెరికా డెబ్ట్ సమస్యల కారణంగా బంగారం డిమాండ్ పెరుగుతూ, భారత మార్కెట్‌లో కూడా తులం ₹2,00,000 వరకు చేరే అంచనాలు బలపడుతున్నాయి.

అంతర్జాతీయ గ్లోబల్ మార్కెట్, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు, డీ-డాలరైజేషన్, జియోపాలిటికల్ టెన్షన్‌లు, లిమిటెడ్ సప్లై, కరెన్సీ డివాలివేషన్.. ఇలాంటి అనేక అంశాలు కలిసి తులం బంగారం ధరను ₹2,00,000కు చేరేలా మారుస్తాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, నిజంగానే బంగారం ధరలు రెండు లక్షలు అవుతుందా? లేదా అంతకు మించి పెరుగుతుందా లేదా తగ్గుతుందా? అనేది రాబోయే రోజులే స్పష్టం చేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories