జోతిష్యశాస్త్రంలో మొత్తం 9 గ్రహాలు ఉంటాయి. వాటిలో కొన్ని గ్రహాలు మిత్ర గ్రహాలు కాగా, మరి కొన్ని శ్రత్రు గ్రహాలుగా వర్గీకరించారు. గ్రహ సంచార సమయంలో.. ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుస్తాయి. ఇలాంటి సమయంలో శత్రు గ్రహాలు కలిసినప్పుడు అది కొన్ని రాశులపై అశుభ ప్రభావం చూపుతుంది. మార్చి 2వ తేదీన శుక్రుడుమీన రాశిలోకి సంచరిస్తాడు. మార్చి 15వ తేదీన సూర్యుడు మీన రాశిలోకి అడుగుపెడతాడు. ఈరెండింటి కలయిక కారణంగా శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ రెండూ శత్రు గ్రహాలు కాబట్టి..వీటి కలయిక.. కొన్ని రాశుల వారికి సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..