జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు కొనసాగనుంది. ఈ మాసంలో సూర్యుడు, గురుడు, శని, బుధ గ్రహాల అనుకూల సంచారం వల్ల కొన్ని నక్షత్రాల వారికి బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. శ్రావణంలో చంద్రుడి స్థానం అనుకూలంగా ఉండటంతో ఈ నక్షత్రం వారికి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.