Zodiac Signs: నవపంచమ రాజయోగం.. ఈ 3 రాశుల వారు ధనవంతులవుతారు..!

Published : Apr 03, 2025, 01:58 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. ఏప్రిల్ నెలలో కుజుడు, శని గ్రహాలు నవపంచమ రాజయోగాన్ని సృష్టించనున్నాయి. దీనివల్ల 3 రాశుల వారి దశ మారునుంది. మరి ఆ రాశులెంటో వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఓసారి చూసేద్దామా?

PREV
14
Zodiac Signs: నవపంచమ రాజయోగం.. ఈ 3 రాశుల వారు ధనవంతులవుతారు..!

కర్మఫలం ఇచ్చే శని ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత శని మీన రాశిలోకి ప్రవేశించి.. చాలా రాశులకు సాడేసాతి నుంచి విముక్తి కలిగించాడు. మీన రాశిలో ఉన్న శని.. గ్రహాలకు అధిపతి అయిన కుజుడితో కలిసి ఏప్రిల్ 5న నవపంచమ రాజయోగం ఏర్పరచనున్నాడు. దీనివల్ల 3 రాశుల వారికి మాససికంగా, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందట. మరి ఆ రాశులెంటో ఓసారి చూసేయండి.

24
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి నవపంచమ రాజయోగం చాలా మంచిది. ఈ రాశికి వివాహ గృహంలో కుజుడు ఉన్నాడు. దీంతో ఈ రాశి శని ప్రభావం నుంచి విముక్తి పొందుతుంది. ఈ రాశి వారు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి.

34
కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా నవపంచమ రాజయోగం కలిసి వస్తుంది. ఉద్యోగులకు లాభాలు వస్తాయి. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సక్సెస్ అవుతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీరు వేసుకున్న ప్లాన్స్ ద్వారా మంచి లాభం పొందవచ్చు. అన్నీ శుభాలే జరుగుతాయి.

44
తులా రాశి

తులా రాశిలో కుజుడు, శని కలయిక వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. జీవితంలో వచ్చే సమస్యలను అధిగమిస్తారు. శని దయతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మంచి జరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories