Zodiac Signs: 30 ఏళ్ల తర్వాత అద్భుతమైన రాజయోగం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మొదలైనట్లే!

Published : Jul 29, 2025, 02:50 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు 30 ఏళ్ల తర్వాత శని, గురు గ్రహాలు కలిసి నవపంచమ రాజయోగం సృష్టించనున్నాయి. ఈ రాజయోగం ప్రభావంతో కొన్ని రాశులవారికి మేలు జరగనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, ధన లాభం కలగనుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా..   

PREV
14
నవ పంచమ రాజయోగం..

జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తుంటాయి. శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుంటాయి. వాటి ప్రభావం అన్ని రాశిచక్రాలపై పడుతుంది. అక్టోబర్‌లో గురువు తన ఉచ్ఛ రాశి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు, శనితో కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం ప్రకాశిస్తుంది. వీరు ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. దేశ, విదేశ యాత్రలు చేస్తారు. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందామా... 

24
మేష రాశి

మేష రాశి వారికి నవపంచమ రాజయోగం శుభప్రదం. ఈ యోగం మేష రాశి నాల్గవ ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో సౌకర్యాలు పెరుగుతాయి. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. విదేశీ వ్యాపారులకు లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం లభించవచ్చు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలు దక్కుతాయి.  

34
కర్కాటక రాశి

నవపంచమ రాజయోగం కర్కాటక రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో ఈ రాశివారు బాగా పాపులర్ అవుతారు. గౌరవం పెరుగుతుంది. వివాహితులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సొంత వ్యాపారం ప్రారంభిస్తారు. పెళ్లికాని వారికి వివాహం నిశ్చయం కావచ్చు.  

44
మీన రాశి

మీన రాశి వారికి నవపంచమ రాజయోగం శుభ ఫలితాలనిస్తుంది. ఈ యోగం ఈ రాశివారి ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో వీరు పిల్లలకు సంబంధించిన శుభవార్త వింటారు. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. నిరుద్యోగులు స్నేహితుల సహాయంతో మంచి జీతంతో కొత్త ఉద్యోగం పొందుతారు. ఈ రాశివారి కోరికలు నెరవేరుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories