శని సంచారం.. ఈ 3 రాశుల వారికి సంపద రెట్టింపు కావడం ఖాయం!

Published : Sep 22, 2025, 05:12 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శని సంచారం కొన్ని రాశులవారికి కీడు చేస్తే.. మరికొన్ని రాశులవారికి మేలు చేస్తుంది. అక్టోబర్ లో శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ సంచారం 3 రాశులవారికి సంపదను రెట్టింపు చేస్తుంది.  

PREV
14
శని సంచారం

శని సంచారం అంటేనే అన్ని రాశులవారు భయపడిపోతుంటారు. అయితే ప్రతిసారీ శని సంచారం ప్రభావం చెడుగానే ఉండదు. కొన్ని రాశులవారి మేలు జరిగితే, మరికొన్ని రాశులవారికి చెడు ఫలితాలు రావచ్చు. శని ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. అక్టోబర్ 3వ తేదీ రాత్రి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దానివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ రాశులేంటో చూద్దామా..

24
కర్కాటక రాశి

శని సంచారం కర్కాటక రాశివారికి మేలు చేస్తుంది. శని.. కర్కాటక రాశి తొమ్మిదో ఇంట్లో సంచరించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అన్ని రంగాలవారు మంచి విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో కొత్త శిఖరాలకు చేరుకుంటారు.

34
కుంభ రాశి

శని సంచారం కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు వృత్తి, వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ బంధాలు బలపడుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఈ రాశివారి మాటలు ఇతరులను ఆకర్షిస్తాయి. దానివల్ల వ్యాపారంలో కొత్త కస్టమర్లను పొందుతారు. ప్రతి పనిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. 

44
మీన రాశి

శని సంచారం వల్ల మీన రాశి వారు కూడా మంచి ఫలితాలు పొందుతారు. శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తూ మీన లగ్న గృహంలో ఉంటాడు. దీనివల్ల వీరి వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ప్రతి పనిలో కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఎప్పుడో నిలిచిపోయిన డబ్బు చేతికొస్తుంది. ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories