జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శని గ్రహం ప్రతీ రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి మారుతుంది. దీంతో పలు గ్రహాలపై ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటంటే..
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి మారుస్తుంది. 2025 మార్చి నెలలో శని మీన రాశిలో ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన జూన్ 2027 వరకు మీన రాశిలోనే ఉంటాడు. ప్రస్తుతం కుంభ, మీన, మేష రాశి వారు ఏలిన నాటి శని ప్రభావంలో ఉన్నారు.
శనిని న్యాయదేవుడిగా పిలుస్తారు. మనిషి చేసిన పాపం, పుణ్యం ఆధారంగా శని ఫలితాలు ఇస్తాడు. అందుకే ఈ కాలంలో మన ప్రవర్తన, పనులు చాలా ప్రభావం చూపుతాయి.
25
ఏలిన నాటి శని సమయంలో ఏం జరుగుతుంది.?
ఈ కాలంలో శని కష్టాలు, అడ్డంకులు పరీక్షల రూపంలో ఇస్తాడు. కర్మ ఫలితాల ప్రకారం ఫలితాలు భిన్నంగా ఉంటాయి. మంచి పనులు చేసే వారికి ఈ కాలం అంత కష్టం కాదు. కానీ కష్టపడిన తర్వాతే ఫలితాలు వచ్చే సమయం ఇది.
శని బలహీనంగా, శత్రు రాశిలో లేదా జాతకంలో అశుభ స్థానంలో ఉంటే సమస్యలు ఎక్కువవుతాయి. జాగ్రత్తలు పాటించడం, శని పూజలు చేయడం ద్వారా ఈ ప్రభావం తగ్గించవచ్చు.
35
కుంభ, మీన, మేష రాశి వారు చేయాల్సిన పూజలు
శనివారం నాడు శని దేవుడిని పూజించాలి. నల్ల లేదా నీలం రంగు దుస్తులు ధరించి శని ఆలయానికి వెళ్లాలి. ఆవ నూనెతో మట్టి లేదా ఇనుము దీపం వెలిగించాలి. నల్ల పువ్వులు సమర్పించాలి. శని మంత్రం లేదా శని చాలీసా చదవాలి. ఈ పూజల వల్ల శని కృప పెరుగుతుంది ఏలిన నాటి శని ప్రభావం తగ్గుతుంది.
శనివారాల్లో నల్ల కుక్కకు ఆహారం పెట్టడం. పేదలకు నల్ల నువ్వులు, ఆవ నూనె, దుప్పట్లు దానం చేయడం. నల్ల చెప్పులు లేదా బూట్లు దానం చేయడం. హనుమంతుడిని పూజించడం. రావి చెట్టుకు నీళ్లు పోయడం. హనుమంతుడి పూజ ప్రత్యేకంగా శనిని ప్రసన్నం చేస్తుంది.
55
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
అబద్ధం చెప్పకూడదు, ఎవరీని మోసం చేయకూడదు. సోమరితనం మానుకోవాలి. పేదలను, పెద్దలను గౌరవించాలి. జంతువులను హింసించకూడదు. మాంసం, మద్యం, చెడు సాంగత్యం దూరం పెట్టాలి. కుంభ రాశి వారికి ఏలిన నాటి శని జూన్ 3, 2027 వరకు కొనసాగుతుంది. హనుమంతుడి భక్తులను శని ఇబ్బంది పెట్టడు. అందుకే ఏలిన నాటి శని సమయంలో హనుమంతుడిని పూజించాలి.