జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేపు (మార్చి 21- శనివారం) బుధుడు కుంభరాశిలో మార్గంలో సంచరించిస్తాడు. ఈ రాశిలో బుధుడితో పాటు కుజుడు, రాహువు కూడా ఉంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. మరి ఆ రాశులేవో, వారికి ఏ విషయాలు కలిసివస్తాయో చూద్దాం.
మేష రాశి పదకొండవ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. దీనివల్ల వీరికి అనేక రంగాల్లో లాభాలు వస్తాయి. కాస్త కష్టపడాల్సి వచ్చినా, అది ప్రయోజనకరంగానే ఉంటుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మెరుగైన పరిస్థితులు ఉంటాయి.
25
వృషభ రాశి- ప్రతిభకు తగిన గుర్తింపు
వృషభ రాశి పదవ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. దీంతో ఈ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు దక్కుతాయి. పనిలో మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులు, షేర్ మార్కెట్, భూమి సంబంధిత విషయాల్లో ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది.
35
మిథున రాశి- అద్భుతమైన విజయం
మిథున రాశి తొమ్మిదవ ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల వీరికి అదృష్టం కలిసివస్తుంది. ప్రతి రంగంలోనూ వీరు అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, జీతం పెంపుతో పాటు ప్రమోషన్ లభించవచ్చు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
బుధుడి సంచారం కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిలో బుధుడు లగ్నభావంలో ఉంటాడు. దీనివల్ల వీరి నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. తీసుకున్న నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
55
మీన రాశి- కష్టానికి తగిన ఫలితం
మీన రాశి పన్నెండవ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. దానివల్ల ఈ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.