మిథున రాశి..
గురు గ్రహం పునర్వసు నక్షత్రంలోకి సంచారం చేయడం మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. గురు సంచారం కారణంగా, మిథున రాశివారు శారీరకంగా, మానసికంగా దృఢంగా కనిపిస్తారు. ప్రతి పనిలోనూ చాలా చురుకుగా ఉంటారు. ఈ సమయం ఉద్యోగం, వ్యాపారంలో లాభాల అవకాశాలను పెంచుతుంది. చాలా కాలంగా ఒక ఆగిపోయిన పనులు ఇప్పుడు జరుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. గురు గ్రహం ఆశీర్వాదం కారణంగా.. ఈ రాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు.