చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే పండగలలో దీపావళి ముందు వరసలో ఉంటుంది. ఈ ఏడాది దీపావళి పండగను దేశ వ్యాప్తంగా ప్రజలు అక్టోబర్ 20వ తేదీన జరుపుకోనున్నారు. ఈ పండగ రోజున ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. అంతేకాదు.. సాయంత్రం వేళ లక్ష్మీ దేవి, కుబేరుడిని పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కేవలం ఆమెను పూజించడం మాత్రమే కాకుండా.. వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. దీపావళి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్ముతారు. మరి, అవేంటో చూద్దామా...