తన ఇష్టాయిష్టాల గురించి చెబుతూ తెలుగులో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అలాగే సల్మాన్ ఖాన్, జాకీ ఫ్రాఫ్ తో కలిసి పని చేయాలని ఉందని తెలిపింది. మొదట్లో తాను చదువుకోవాలని అనుకునేదాన్ని, సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ భావించలేదని చెప్పింది. తను ఒకసారి కాదు మూడుసార్లు వైరల్ అయినట్టు చెప్పింది. అయితే మూడోసారి వైరల్ అయినప్పుడు దేశమంతా గుర్తింపు వచ్చిందని.. అలా సినిమాల్లోకి రావాల్సి వచ్చిందని వివరించింది. మోనాలిసా ప్రయాగ్ రాజ్లో పూసలు అమ్మడానికి రావడం వెనుక ఒక కారణం ఉందని వివరించింది. దానికి ముందే తనను పాము కరిచిందని, తనను కాపాడేందుకు తన తల్లి రెండు మూడు లక్షల అప్పు చేసిందని ఆ అప్పు తీర్చడం కోసమే తాము ప్రయాగ్ రాజ్ కుంభమేళాకి వచ్చి పూసలు, రుద్రాక్షలు అమ్మే షాపు పెట్టామని చెప్పింది.