రుణ విముక్తి పొందాలనుకునే వారు సూర్యోదయం సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇందుకోసం: 11 తులసి ఆకులు, బెల్లం ముక్క, యాలకులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేక సమయంలో "ఓం నమః శివాయ" మంత్రాన్ని భక్తితో జపించాలి. అనంతరం తులసి ఆకులను ఎండబెట్టి లేదా శుభంగా ఉంచి ఇంట్లో భద్రపరచుకోవాలి. ఇవి నెగటివ్ ఎనర్జీని తొలగించి, ధనప్రవాహం, శాంతి, రుణమోచనానికి దోహదపడతాయనేది విశ్వాసం.