వానలు దంచికొట్టే జిల్లాలు ఇవే.. 50 కిమీ వేగంతో గాలులు
ద్రోణి ఎఫెక్ట్తో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వీటితో పాటు అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు.
వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. తెలంగాణలో కూడా గురువారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని హిమాయత్నగర్లో 7 సెం.మీ, గచ్చిబౌలిలో 5 సెం.మీ, గోల్కొండలో 3 సెం.మీ చొప్పున భారీ వర్షపాతం రికార్డైంది.