weather update: ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా కంటే ముందుగానే మే 27న కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులకు ఎంతో అవసరమైన వర్షాలు త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ, వచ్చే నాలుగైదు రోజుల్లో అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ-మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవనాల ప్రభావం విస్తరించనుందని అంచనా వేసింది.