Rain Alert in Andhra Pradesh: Light to Moderate Showers
Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా, మరోవైపు వానలు పడుతున్నాయి. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ అఫ్ మన్నార్ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కాణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ద్రోణి ప్రస్తుతం ఈశాన్య విదర్భ నుంచి గల్ఫ్ అఫ్ మన్నార్ వరకు కొనసాగుతోంది. అలాగే, తెలంగాణ, కర్నాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కూడా కొనసాగుతుంది.
Weather Update: Thunderstorms, Lightning Likely in AP Amid Changing Climate
దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింద. గత రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Unstable Weather in Andhra Pradesh: Heat During Day, Rain in Evenings
వర్ష ప్రభావంతో పాటు ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అయితే, వేసవిలో అడపాదడపా వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. అలాగే, అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ఐఎండి అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
IMD Issues Rain Warning for Andhra Pradesh Districts – Public & Farmers Alerted
ఐఎండీ సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ఒక హెచ్చరిక జారీ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారి చేసింది. తీరప్రాంతాలు అధిక సముద్ర అల్లకల్లోలాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వెళ్లవద్దని పేర్కొంది.