ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇక గుంటూరు, శ్రీకాకుళం,శ్రీ సత్యసాయి, కడప, కర్నూల్, నంద్యాల, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.