అత్యవసర దర్శనం అవకాశంగా పరిగణించే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ మే 15వ తేదీ నుంచి స్వీకరిస్తుంది. ఈ సిఫార్సులతో వచ్చే భక్తులకు మే 16వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించనున్నారని తెలిపారు.