Visakhapatnam: ఏపీ ప్రజల దశాబ్దాల కల.. జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ షురూ.. కలిగే లాభాలు ఇవే

Published : May 29, 2026, 09:16 AM IST

Visakhapatnam Railway Zone: జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్స్ స్టార్ట్ కానున్నాయి. 4 డివిజన్లు, రూ.15,500 కోట్ల ఆదాయంతో ఏపీ రైల్వే రూపురేఖలు మారబోతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
వైజాగ్ రైల్వే జోన్ వచ్చేసింది.. జూన్ 1 నుంచి ఏపీ రైల్వే రేంజ్ మారబోతోంది

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల బిగ్గెస్ట్ డ్రీమ్ నెరవేరబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ వచ్చే వారం షురూ కానుంది. దేశంలోనే 18వ రైల్వే జోన్‌గా అవతరించిన 'దక్షిణ కోస్తా రైల్వే' (SCoR) జూన్ 1 నుంచి అఫీషియల్‌గా తన పనులను స్టార్ట్ చేయబోతోంది.

దీనికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రిలీజ్ చేసింది. 2014 ఏపీ విభజన చట్టంలోని మెయిన్ ప్రామిస్‌లలో ఒకటైన ఈ రైల్వే జోన్‌ను 2019 బడ్జెట్‌లో అనౌన్స్ చేశారు. లాంగ్ వెయిటింగ్ తర్వాత ఇప్పుడు ఇది ఫైనల్‌గా ట్రాక్ పైకి వచ్చింది.

26
బిగ్ రీస్ట్రక్చరింగ్.. మారిన రైల్వే మ్యాప్

ఈ కొత్త జోన్ కోసం రైల్వే నెట్‌వర్క్‌లో భారీ మార్పులు చేశారు. ఇప్పటివరకు సికింద్రాబాద్ హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను ఇందులో కలిపారు. అలాగే ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే (ECoR) పరిధిలోని వాల్తేరు డివిజన్‌ను రీస్ట్రక్చర్ చేసి, విశాఖపట్నం డివిజన్‌ గా మారుస్తూ ఈ కొత్త జోన్‌లో విలీనం చేశారు.

ఈ దెబ్బతో సికింద్రాబాద్ పరిధి బాగా తగ్గిపోనుంది. ఇప్పటివరకు 6 డివిజన్లతో దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జోన్‌గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే.. ఇకపై కేవలం హైదరాబాద్, నాందేడ్, సికింద్రాబాద్ డివిజన్లతోనే రన్ అవుతుంది. అటు అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉండడం కోసం పలాస-ఇచ్ఛాపురం, రాయచూరు-వాడి లాంటి కొన్ని బోర్డర్ రైల్వే సెక్షన్లను కూడా అటుఇటుగా అడ్జస్ట్ చేశారు.

36
4 డివిజన్లు.. 385 స్టేషన్లతో మెగా జోన్

దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేంజ్ మామూలుగా లేదు. టోటల్‌గా 3,532 రూట్ కిలోమీటర్ల మేర ఈ జోన్ విస్తరించి ఉంటుంది. అదే డబుల్ లైన్, ట్రిపుల్ లైన్ ట్రాక్‌లు అన్నీ కలిపితే మొత్తం ట్రాక్ లెంత్ 6,454 కిలోమీటర్లకు చేరుతుంది.

• టోటల్ డివిజన్లు: 4 (విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం)

• మొత్తం స్టేషన్లు: 385 రైల్వే స్టేషన్లు ఈ జోన్ కిందకు వస్తాయి.

• భారీ స్టాఫ్: ఈ నాలుగు డివిజన్లలో కలిపి దాదాపు 62 వేల మంది ఎంప్లాయీస్ వర్క్ చేయనున్నారు. వీరు కాకుండా విశాఖలోని మెయిన్ హెడ్‌క్వార్టర్స్‌లో 128 మంది గెజిటెడ్ అధికారులు, 1,100 మంది నాన్-గెజిటెడ్ స్టాఫ్ ఉంటారు.

46
రూ.15,500 కోట్ల ఆదాయం.. ఎకానమీ నెక్స్ట్ లెవెల్

ఈ కొత్త జోన్ వల్ల ఏపీకి ఎకనామికల్‌గా సూపర్ బూస్ట్ లభించనుందని ఈ రంగం నిపుణులు చెబుతున్నారు. కొత్త జోన్ పరిధిలో ప్రతి ఏటా సుమారు 100 మిలియన్ టన్నుల సరకు రవాణా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో ఉన్న బిగ్గెస్ట్ పోర్టులు, ఇండస్ట్రీస్ వల్ల ఫ్యూచర్‌లో ఈ కార్గో ట్రాన్స్‌పోర్ట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. దీని ద్వారా అటు సరకు రవాణా, ఇటు ప్యాసింజర్ టికెట్ల ద్వారా ఏటా ఏకంగా రూ.15,500 కోట్ల భారీ రెవెన్యూ జనరేట్ కానుంది. ఈ లెవెల్ ఆదాయం అంటే ఏపీ రైల్వే డెవలప్‌మెంట్‌కు తిరుగుండదు.

56
జూన్ 1 నుంచి ఏం మారబోతోంది?

ప్రస్తుతం వైజాగ్ లోని వీఎంఆర్‌డీఏ డెక్ బిల్డింగ్‌లో టెంపరరీగా జోన్ ఆఫీస్‌ను సెట్ చేశారు. ఆల్రెడీ జోనల్ మేనేజర్, కొందరు మెయిన్ ఆఫీసర్స్ అపాయింట్ అవ్వడంతో గత డిసెంబర్ నుంచే ఇన్‌డైరెక్ట్‌గా వర్క్ స్టార్ట్ అయింది. కానీ జూన్ 1 నుంచి అంతా అఫీషియల్ కానుంది.

ఇప్పటివరకు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డీఆర్‌ఎంలు ప్రతి చిన్న విషయానికి సికింద్రాబాద్ జీఎంకు రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. అలాగే వాల్తేరు డీఆర్‌ఎం ఒడిశాలోని భువనేశ్వర్ జీఎం చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ జూన్ 1 నుంచి సీన్ టోటల్‌గా రివర్స్ కాబోతోంది. ఈ నాలుగు డివిజన్ల డీఆర్‌ఎంలు డైరెక్ట్‌గా విశాఖపట్నంలో కూర్చునే దక్షిణ కోస్తా జోన్ జనరల్ మేనేజర్ కే రోజువారీ రిపోర్ట్స్ ఇస్తారు. రైళ్ల రాకపోకలు, డిలేస్, సేఫ్టీ పనులు, కొత్త ప్రాజెక్టుల డెసిషన్స్ అన్నీ వైజాగ్ నుంచే కంట్రోల్ అవుతాయి.

66
ఏపీ జనానికి కలిగే టాప్ బెనిఫిట్స్ ఇవే

విశాఖ రైల్వే జోన్ వల్ల ఏపీ ప్రజలకు లాంగ్ రన్‌లో మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి.

1. కొత్త రైళ్లు, రూట్లు: సొంత జోన్ వచ్చింది కాబట్టి ఏపీకి కొత్త రైళ్లు, స్పెషల్ ట్రైన్స్ కేటాయింపు చాలా ఈజీ అవుతుంది.

2. స్పీడ్ డెవలప్‌మెంట్: రైల్వే లైన్ల డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్, స్టేషన్ల మోడ్రనైజేషన్ పనులకు ఫండ్స్ త్వరగా శాంక్షన్ అవుతాయి.

3. లోకల్ ప్రాబ్లమ్స్ క్లియర్: రైల్వే సమస్యలపై సికింద్రాబాద్‌కో, భువనేశ్వర్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. లోకల్ లీడర్స్, అధికారులు వైజాగ్‌లోనే మాట్లాడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు.

4. ఎంప్లాయ్‌మెంట్ బూస్ట్: కొత్త జోన్ హెడ్‌క్వార్టర్స్ వల్ల లోకల్‌గా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వైజాగ్ సిటీ రేంజ్ మరింత పెరుగుతుంది.

ఇక శాశ్వత హెడ్‌క్వార్టర్స్ బిల్డింగ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. మొత్తానికి ఏపీ రైల్వే హిస్టరీలో జూన్ 1 ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోనుందని చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories