TDP Net Worth : అమ్మో.. టీడీపీ అకౌంట్లో అన్ని వందల కోట్లా? చంద్రబాబు పార్టీ ఖర్చు, ఆదాయం లెక్కలు ఇవే..

Published : May 28, 2026, 08:52 AM IST

TDP Net Worth: తెలుగు దేశం పార్టీ మహానాడు 2026 లో టీడీపీ ఆస్తులు, ఆదాయం, ఖర్చుల చిట్టాను బయటపెట్టింది. పార్టీ కోట్ల రూపాయల జనరల్ ఫండ్‌తో పాటు నారా లోకేష్ చేసిన సంచలన ప్రకటన హైలైట్‌గా నిలిచింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
టీడీపీ ఆదాయం ఎంతో తెలిస్తే అమ్మో అంటారు.. అసలు లెక్కలు ఇవే

తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'మహానాడు 2026' గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. అయితే ఈసారి ఖర్చులు తగ్గించుకుంటూ, పొదుపు మంత్రం పాటిస్తూ సరికొత్తగా హైబ్రిడ్ మోడ్‌లో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మెయిన్ ప్రోగ్రామ్ రన్ అవ్వగా, స్టేట్ వైడ్‌గా దాదాపు 1,875 క్లస్టర్ల నుంచి ఏకంగా 7.28 లక్షల మంది కార్యకర్తలు, లీడర్లు ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ స్క్రీన్స్‌పై మెరిశారు.

నూజివీడు లాంటి కొన్ని ఏరియాల్లో అయితే 100% అటెండెన్స్‌తో క్యాడర్ రికార్డ్ క్రియేట్ చేసింది. చంద్రబాబు నాయుడు జెండా ఎగరేసి, జ్యోతి వెలిగించి ఈ పండుగను అఫీషియల్‌గా ఓపెన్ చేశారు. ఇటీవల చనిపోయిన పార్టీ శ్రేణులకు సంతాపం తెలిపాక, సరికొత్త పొలిటికల్ జోష్‌తో తీర్మానాలు ప్రవేశపెట్టారు.

25
తెలుగుదేశం పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?

ప్రతి ఏటా లాగే ఈసారి కూడా మహానాడులో పార్టీ సీనియర్ లీడర్ కొనకళ్ల నారాయణ టీడీపీకి సంబంధించిన పక్కా లెక్కలను, జమాఖర్చుల చిట్టాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం, 2026 మార్చి నాటికి తెలుగుదేశం పార్టీ 'జనరల్ ఫండ్' అకౌంట్‌లో ఏకంగా రూ.485.81 కోట్లు బాలెన్స్ ఉన్నట్లు లీక్ చేశారు.

ఇక 2025-26 ఫైనాన్షియల్ ఇయర్‌కు గాను పార్టీకి వచ్చిన ఆదాయం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం మెంబర్‌షిప్ ద్వారా రూ.1.62 కోట్లు రాగా, భారీగా విరాళాల రూపంలో రూ.58.32 కోట్లు కలెక్ట్ అయ్యాయి. బ్యాంక్ ఇంట్రెస్ట్ ద్వారా రూ.29.10 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.1.52 కోట్లతో కలిపి టోటల్‌గా ఈ ఒక్క ఏడాదిలోనే రూ.90.64 కోట్ల రాబడి వచ్చింది.

35
ఖర్చులు ఎక్కడెక్కడ అంటే.. కార్యకర్తలకు భారీ ఇన్సూరెన్స్

రాబడి మాత్రమే కాదు, పార్టీ కోసం చేసిన ఖర్చుల డీటెయిల్స్ కూడా అంతే ట్రాన్స్‌పారెంట్‌గా బయటపెట్టారు. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే.. గ్రౌండ్ లెవల్‌లో కష్టపడే కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రమాదాల్లో చనిపోయిన లేదా గాయపడిన కార్యకర్తల ఫ్యామిలీస్ కోసం ఏకంగా రూ.46.52 కోట్లు ఇన్సూరెన్స్ రూపంలో చెల్లించారు. 

ఇక పార్టీ పబ్లిసిటీ, ప్రచార కార్యక్రమాల కోసం రూ.16.52 కోట్లకు పైగా ఖర్చు చేశారు. టోటల్‌గా అన్ని రకాల ఖర్చులు కలిపి ఈ ఇయర్‌లో రూ.74.25 కోట్లు అవ్వగా.. ఇంకా రూ.16.39 కోట్లు మిగిలాయని లెక్కలు చెప్పారు.

45
నెల్లూరు ఎంపీ భారీ విరాళం.. వెల్లువెత్తిన కోట్లు

మహానాడు ఫస్ట్ రోజే పార్టీ ఫండ్‌కు విరాళాలు వెల్లువలా కురిశాయి. కేవలం ఒకే రోజులో దాదాపు రూ.11.70 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. ఇందులో టాప్ హైలైట్ ఏంటంటే.. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు ఏకంగా రూ.5 కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చారు. 

వీరితో పాటు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ రూ.1.5 కోట్లు ఇవ్వగా.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి, పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తలా రూ.1 కోటి చొప్పున విరాళం ఇచ్చారు.

55
టీడీపీ తరపున మహిళలకు కచ్చితంగా 33 శాతం సీట్లు: లోకేష్

మహానాడు లో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఒక బిగ్ సంచలన ప్రకటన చేశారు. ఎక్స్ లో ఉదయాన్నే హైప్ క్రియేట్ చేసిన లోకేష్.. మధ్యాహ్నం 12 గంటలకి 'స్త్రీశక్తి' థీమ్‌కు తగ్గట్టుగా ఒక మాస్ అప్‌డేట్ ఇచ్చారు. 

పార్లమెంట్‌లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండానే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున మహిళలకు కచ్చితంగా 33 శాతం సీట్లు ఇస్తామని అఫీషియల్‌గా అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇక సీఎం చంద్రబాబు తన 43 నిమిషాల స్పీచ్‌లో వైసీపీపై ప్రాసలతో, అదిరిపోయే పంచ్‌లతో అటాక్ చేస్తూనే.. కార్యకర్తలకు క్లాస్ తీసుకుంటూ ఫుల్ జోష్ నింపారు.

Read more Photos on
click me!

Recommended Stories