స్థానిక ఆలయాల ప్యాకేజీతో పాటు శ్రీకాళహస్తి దర్శనానికి రూ.450, కాణిపాకం ఆలయానికి రూ.550 వసూలు చేస్తారు. తిరువణ్ణామలై, వేలూరు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం ఆలయాలను ఏసీ బస్సులో దర్శించాలంటే ఒక్కరికి రూ.1200 చెల్లించాలి.
శ్రీకాళహస్తి టూర్లో తిరుపతి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి తిరుచానూరు, వికృతమాలలోని సంతాన సంపద వేంకటేశ్వర స్వామి ఆలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయం, తొండమనాడులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, కపిలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తారు.
నాన్ ఏసీ బస్ టికెట్: ఒక్కరికి రూ.450
ఈ బస్సులు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయాల్లో అందుబాటులో ఉంటాయి. అక్కడ ఉన్న పర్యాటకశాఖ సమాచార, రిజర్వేషన్ కార్యాలయాల్లో పూర్తి వివరాలు పొందవచ్చు. పూర్తి వివరాల కోసం 9848007033, 0877 – 2289123 నెంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.