తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో కూడా రేపు (గురువారం, మే 28) వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలకు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా తోడై ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది వాతావరణ విభాగం.
ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
రాజధాని హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్నిచోట్ల ఈదురుగాలులతో (గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయట. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని.. మే 2 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం ప్రకటించింది.