ఇవాళ (అక్టోబర్ 1, బుధవారం) తెలంగాణలో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు తోడై ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది. ఇక 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.