విశాఖలో మిలన్ 2024: 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు

First Published Feb 22, 2024, 10:42 AM IST

విశాఖపట్టణం నగరంలో మిలన్ 2024 విన్యాసాలు  ఘనంగా ప్రారంభమయ్యాయి.

విశాఖలో మిలన్ 2024: 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు

నేవి మిలన్ 2024 విశాఖపట్టణంలో   ప్రారంభమైంది. పలు దేశాల నుండి నేవీకి చెందిన  నౌక దళాలు  ఈ విన్యాసంలో పాల్గొంటున్నాయి.  ఈ నెల  19 నుండి  27వ తేదీ వరకు  ఈ కార్యక్రమం సాగుతుంది.50 దేశాల నుండి  నౌక దళానికి చెందిన నేవీ బృందాలు ఈ విన్యాసాల్లో  పాల్గొంటున్నాయి.

విశాఖలో మిలన్ 2024: 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు

ఆర్ కే బీచ్ లో అంతర్జాతీయ నగర కవాతు, సముద్ర సెమినార్, టెక్ ఎక్స్ పో, మిలన్ విలేజ్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.ఆధునాతన వాయు రక్షణ, జలాంతర్గామి వ్యతిరేక, ఉపరితల వ్యతిరేక యుద్ధ విన్యాసాలను నిర్వహించనున్నారు. 

విశాఖలో మిలన్ 2024: 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు


వైజాగ్ తీరంలో నిలిపి ఉంచిన  ఐఎన్ఎస్ విక్రాంత్  నౌకను వైజాగ్ వాసులు వీక్షించే అవకాశం తొలిసారి లభించింది. 
మిలన్ విన్యాసాల్లో పాల్గొనేందుకు వచ్చిన  50 దేశాల ప్రతినిధులు తమ తమ దేశాల జెండాలతో  ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 

విశాఖలో మిలన్ 2024: 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు

మిలన్ విన్యాసాల నిర్వహణకు భారత నావికాదళం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.  ఈ విన్యాసాలను తిలకించేందుకు పలువురు ప్రముఖులు, విఐపీలు  విశాఖకు చేరుకుంటున్నారు. 

click me!