ఇవాళ (మే 20, మంగళవారం) తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదుకానుందట. తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి,కోనసీమ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.