శ్రీవారికి ఐపిఎల్ టీం యజమాని ఖరీదైన కానుక :
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎల్ఎస్జి అధినేత సంజీవ్ గోయెంక కుటుంబ సమేతంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల దేవాలయాన్ని సందర్శించారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన 5.267 కిలోల బంగారు కవచాలను కానుకగా సమర్పించారు. ఈ బంగారు కానుక విలువ సుమారు 3.63 కోట్ల రూపాయలు.
స్వామివారు కానుకతో ఆలయానికి చేరుకున్న సంజీవ్ గోయెంక కుటుంబానికి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. అధికారులు దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. సంజీవ్ గోయెంక తిరుమల దర్శనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.