తాజాగా కొన్ని జిల్లాల్లో తల్లికి వందనం డబ్బులు రాలేదని చెప్పి మహిళలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కాల్ చేసిన వ్యక్తులు తమను బ్యాంక్ ఉద్యోగులుగా లేదా ప్రభుత్వ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటున్నారు. ఖాతా హోల్డ్లో ఉందని, అకౌంట్ అప్డేట్ చేయాలంటూ భయపెట్టి మహిళల నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ అకౌంట్ నంబర్, డెబిట్ కార్డ్ వివరాలు, ఓటీపీలు కూడా అడుగుతున్నారు.ఈ వివరాలన్నీ ఇచ్చిన వెంటనే ఖాతాల్లో ఉన్న మొత్తం డబ్బులు మాయం అవుతున్నట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా మోసపోతున్నవారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కావడం ఆందోళన కలిగించే విషయం.