స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బలభద్రపురంలో గత రెండేళ్లుగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నారని, ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారని ఆయన తెలియజేశారు. రెండేళ్లలో ఎంతో మంది చనిపోయారని, గత ఏడాది కాలంలోనే సుమారు 21 మంది క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితికి కారణం బలభద్రపురానికి చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలే కారణమని ఆయన ఆరోపించారు. ప్రజలను రక్షించాలని ఆయన కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో అందరికీ క్యాన్సర నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.