AP SSC Public Examinations: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Published : Mar 16, 2025, 08:08 PM ISTUpdated : Mar 16, 2025, 08:35 PM IST

AP SSC Public Examinations: ఆంధ్రప్రదేశ్ లో సోమవారం (మార్చి 17) నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ ఉచితంగా ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణ స‌దుపాయం క‌ల్పించింది.   

PREV
13
AP SSC Public Examinations: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
AP SSC Public Examinations: Free travel in RTC buses for students appearing for class 10th exams

AP SSC Public Examinations: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాష్ట్రంలో సోమవారం ( మార్చి 17)  నుండి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. NCERT సిలబస్ అమలు చేయ‌డం, ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టడం వంటి పాఠశాల విద్యలో కొత్త సంస్కరణల త‌ర్వాత జ‌రుగుతున్న మొదటి ప‌రీక్ష‌లు ఇవి. విద్యార్థులకు ప్రయాణ ఇబ్బంది కలగకుండా ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. 

23
AP SSC Public Examinations: Free travel in RTC buses for students appearing for class 10th exams

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం 

విద్యార్థుల ర‌వాణాను సుల‌భ‌త‌రం చేయ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం క‌ల్పించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ప్ర‌యాణ విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వారికి ఫ్రీ బ‌స్సు ప్రయాణ స‌ర్వీసులు అందిస్తున్న‌ట్టు తెలిపారు. విద్యార్థులు త‌మ‌ హాల్‌టికెట్‌ చూపిస్తే ఏపీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రాల‌కు వెల్ల‌వ‌చ్చు. 

33
AP SSC Public Examinations: Free travel in RTC buses for students appearing for class 10th exams

మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఏపీ 10వ త‌ర‌గతి పరీక్షలు 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ 10వ త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. రోజువారీ షెడ్యూల్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. ఫిజికల్, బయాలజీ పేపర్లకు పరీక్షల స‌మ‌యం ఉదయం 9:30 నుండి 11:30 వరకు ఉంటుంది.

మొత్తం 5,64,064 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయనుండగా, 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలకు హాజరుకానున్నారు. సార్వత్రిక పాఠశాలల నుండి 30,334 మంది విద్యార్థులు 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజరుకానున్నారు. 

SSC రెగ్యులర్ పరీక్షలకు ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్‌లను, ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కేటాయించారు. 40 కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. అదనంగా 37 స్టోరేజ్ పాయింట్లు, కస్టోడియల్ అధికారులను నియమించారు. పదకొండు స‌మ‌స్యాత్మ‌క పరీక్షా కేంద్రాలను గుర్తించారు. ఇక్క‌డ ప‌రీక్ష‌లు సజావుగా జరిగేలా CCTV నిఘాను ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం 24x7 హెల్ప్‌లైన్ 9032185001 ఏర్పాటు చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories