గుడ్ న్యూస్.. రేపు మీ అకౌంట్లలోకి రూ. 20 వేలు

Published : Apr 25, 2025, 05:36 PM IST

AP government Rs 20,000 scheme: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఈ పథకంతో చాలా మందికి ప్రయోజనం కలగనుంది. రేపు మీ అకౌంట్లలో రూ.20 వేల రూపాయలు జమ అవుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
14
గుడ్ న్యూస్.. రేపు మీ అకౌంట్లలోకి రూ. 20 వేలు

AP government Rs 20,000 matsyakara bharosa scheme:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్. రేపు రూ.20 వేలు అకౌంట్లలోకి వస్తాయని ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అదే మత్స్యకార భరోసా పథకం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. చేపల వేటపై ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిషేధం విధించబడే నేపథ్యంలో, మత్స్యకారుల ఉపాధికి అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తోంది.

24

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం..మత్స్యకార భరోసా మొత్తం రూ.10 వేలు నుండి రూ.20 వేలకు పెంచారు. మొత్తం 1,22,968 మంది మత్స్యకారులు ఈ సాయాన్ని పొందనున్నారు.

గతంలో ఉన్న అర్హత నిబంధనలను సైతం తొలగించి, మత్స్యశాఖలో నమోదు అయిన అన్ని పడవలకూ ఈ పథకం వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

34
Chandrababu Naidu

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మత్స్యకార భరోసా నిధుల అందజేత

శనివారం (ఏప్రిల్ 26)న సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం లో ఈ మత్స్యకార భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా నేరుగా మత్స్యకారులకు సాయం అందించనున్నారు. అలాగే, చంద్రబాబు వారితో కొంత సమయం ముచ్చటించనున్నారు. 

44
Chandrababu Pawan

చేపలవేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు భరోసా

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 16 వరకు చేపల ఉత్పత్తి కాలం కావడంతో వేటపై నిషేధం ఉంటుంది. దీంతో సమయంలో మత్స్యకారులకు ఉపాధి తగ్గిపోవడం సహజం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసింది.

గతంలో వైకాపా ప్రభుత్వం ఈ పథకం లబ్దిదారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించేంది. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories