అరకు డెవలప్ మెంట్...
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని అరకు ప్రాంతం పర్యాటకంగా బాగా డెవలప్ అయ్యింది. దీన్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్రం సిద్దమయ్యింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా టూరిజం డెవలప్మెంట్ ప్లాన్ సిద్దంచేయగా ఇందులో అరకుకు చోటు కల్పించింది. అరకుతో సహా మొత్తం 20 టూరిజం ప్రాంతాలను డెవలప్ చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అరకులో ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మౌంటెన్ ట్రైల్స్, నేచర్ ట్రైల్స్ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కొండ ప్రాంతాలతో కూడిన అరకు ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది... కాబట్టి అందుకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు. ఇలా ఏజెన్సీ ప్రాంతం అరకును యావత్ దేశప్రజలకు పరిచయం చేస్తూ డెవలప్మెంట్ ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్.
ఇక 10,000 మంది పర్యాటక గైడ్లకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంటే అరకు ప్రాంతంలోనే యువతకు ఈ విధంగా ఉపాధి లభించనుంది. ఇక పర్యాటకులు పెరిగితే ఈ ప్రాంతాల్లోని గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తుంది. హోమ్స్టేలు, గైడింగ్, ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉద్యోగాలు పెరగడానికి కేంద్రం నిర్ణయాలు దోహదపడతాయి.