పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన దశ. ఈ క్రమంలోనే నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
చదువులో శ్రద్ధ అవసరం
• ప్రతి సబ్జెక్ట్కు సమయం కేటాయిస్తూ స్టడీ ప్లాన్ రూపొందించుకోవాలి.
• సిలబస్ను కనీసం 2–3 సార్లు పునశ్చరణ చేయడం మంచిది.
• పాత ప్రశ్నపత్రాలు సాధన చేయడం వల్ల ప్రశ్నల నమూనా అర్థమవుతుంది.
పరీక్షల సమయంలో ఆరోగ్యం ముఖ్యం
• రోజుకు కనీసం 7–8 గంటలు నిద్ర తప్పనిసరి.
• పోషకాహారం తీసుకుంటూ ఒత్తిడిని దూరంగా ఉంచుకోవాలి.
• సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించడం మంచిది. పరీక్షల సమయంలో అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు తప్పనిసరి.