రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ కనెక్షన్స్తో కలసి 400 ఎకరాల్లో హైపర్స్కేల్ డేటాసెంటర్ నిర్మించేందుకు ముందుకొచ్చింది.
ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలు:
సామర్థ్యం: 1,000 మెగావాట్లు
పెట్టుబడి: రూ. 98,000 కోట్లు
పూర్తిస్థాయి నిర్మాణ లక్ష్యం: 2030
జామ్నగర్ 1,000 మెగావాట్ల సెంటర్కు అనుసంధానం
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు కావాల్సిన భూములు, మౌలిక సదుపాయాలపై ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు, సంస్థ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. తుది చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.