ఎవరు అర్హులు.. ఎంత మొత్తం అందుతుంది?
ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు, 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 మంజూరు చేస్తారు. అయితే ఇందులో రూ.2,000ను పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మిగిలిన రూ.13,000ను తల్లి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు.