ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అందించిన సమాచారం ప్రకారం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది.
• ఉత్తర కోస్తా, కోస్తాంధ్ర: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు.
• రాయలసీమ: చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఇక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. వర్షాలు పడుతున్నప్పటికీ పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.