రూ. 10 వేల కోట్ల పెట్టుబ‌డులు, 4 వేల మందికి ఉద్యోగాలు.. ఏపీలో భారీ ప్రాజెక్టు

Published : Aug 26, 2026, 02:52 PM IST

Andhra pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి మరింత ఊతమిచ్చే భారీ ప్రాజెక్టుకు కీల‌క అడుగుప‌డింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ గ్రూప్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనుంది. బుధ‌వారం మంత్రి లోకేష్ శంకుస్థాప‌న చేశారు.

PREV
15
హులికెరలో ప్రాజెక్టుకు శంకుస్థాపన

రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం హులికెర గ్రామ సమీపంలో ప్రాజెక్టు పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. మొత్తం 1,325 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న పవన విద్యుత్ ప్రాజెక్టులను రాయదుర్గం, ఉరవకొండ, కల్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సుజ్లాన్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు ముందుకు సాగనున్నాయి. కార్యక్రమంలో మంత్రి లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాజెక్టు నిర్మాణం, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్ విస్తరణకు సంబంధించిన వివరాలను ఆడియో విజువల్ ప్రదర్శన ద్వారా తెలుసుకున్నారు. అనంతరం సంస్థ ప్రతినిధులతో ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.

25
కొత్త బ్లేడ్ తయారీ లైన్లకు ప్రారంభం

సుజ్లాన్ తన తయారీ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఏర్పాటు చేసిన ‘S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్‌’ను కూడా మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. విండ్ టర్బైన్లలో కీలకమైన బ్లేడ్‌ల తయారీ సామర్థ్యం పెరగడం ద్వారా సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. కార్యక్రమానికి ముందు మంత్రి బళ్లారి సమీపంలోని హలకుంది గ్రామంలో ఉన్న సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన విండ్ టర్బైన్‌ను పరిశీలించి దానిపై తన సంతకం చేశారు. సంస్థ ప్రతినిధులు తయారీ ప్రక్రియ, నిల్వ, రవాణా వ్యవస్థలపై వివరాలు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో సుజ్లాన్ ఇప్పటికే 1,700 మెగావాట్లకు పైగా సామర్థ్యంతో విండ్ ఎనర్జీ రంగంలో కీలక సంస్థగా ఉంది. 2030 నాటికి రాష్ట్రంలో మరో 5,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

35
4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

భారీ పెట్టుబడి కారణంగా రాయలసీమలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 మంది యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది. విండ్ టర్బైన్ల ఏర్పాటు, పరికరాల రవాణా, అసెంబ్లింగ్, ఇంజనీరింగ్, ప్లాంట్ నిర్వహణ, సాంకేతిక సేవలు వంటి విభాగాల్లో అవకాశాలు ఏర్పడనున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో స్థానికంగా రవాణా, నిర్మాణ, సరఫరా సేవలకు డిమాండ్ పెరగనుంది. దీనివల్ల చిన్న వ్యాపారాలు, స్థానిక సేవా రంగాలకు కూడా ప్రయోజనం కలగవచ్చు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది.

45
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అనంతపురం

రాయదుర్గం పరిసరాల్లోని భౌగోళిక పరిస్థితులు పవన విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. ఎత్తైన ప్రాంతాలు, విస్తారమైన భూభాగం, గాలి వేగానికి సంబంధించిన అనుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విండ్ టర్బైన్లను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన చోట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని కూడా అనుసంధానించే హైబ్రిడ్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

వాతావరణ డేటా సేకరణ, విండ్ మ్యాపింగ్, గ్రిడ్ కనెక్టివిటీ వంటి అంశాలపై సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టింది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ అవసరాలకు పునరుత్పాదక ఇంధనం నుంచి మరింత తోడ్పాటు లభించనుంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఇలాంటి ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి.

ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం జిల్లా పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. సుజ్లాన్ పెట్టుబడులు రాయలసీమలో కొత్త పారిశ్రామిక అవకాశాలకు మార్గం వేయడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని గ్రీన్ ఎనర్జీ సంస్థలు ఈ ప్రాంతం వైపు వచ్చేలా ప్రోత్సాహం కల్పించవచ్చు.

55
ప్రముఖుల హాజరు

సుజ్లాన్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ హాజరయ్యారు. సుజ్లాన్ గ్రూప్ కో-ఫౌండర్, వైస్ ఛైర్మన్ గిరీష్ తంతి, సీఈవో అజయ్ కపూర్, అడ్వైజర్ వి.బి. రావుతో పాటు టాటా పవర్ ఎండీ సంజయ్ బంగా, టోరెంట్ పవర్ డైరెక్టర్ జిగీష్ మెహతా, వారీ ఎనర్జీస్ సీఎండీ హితేష్ దోషి, ఎన్ఆర్ఈడీసీఏపీ లిమిటెడ్ వీసీ, ఎండీ ఎం. కమలాకర బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories