కోడిపందాలు ప్రత్యక్షంగా చూడటానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. హైటెక్ బరులు, లగ్జరీ సదుపాయాలతో ఈ పందాలను నిర్వహించారు. పందెం రాయుళ్లు లక్షల్లో కాకుండా కోట్లలో డబ్బులు పెట్టడం ఈసారి ప్రత్యేకంగా కనిపించింది.