ఎన్నికల సంఘం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 22 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 నాటికి నామినేషన్ ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మే 9న ఓటింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి తక్కువ స్థాయిలో సీట్లు ఉండటంతో, ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కూటమి (టిడిపి-జనసేన-బిజెపి) అధికార పక్షం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కూటమి ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుందన్నది ఆసక్తికకరంగా మారింది.