భార్య‌, భ‌ర్త మ‌ధ్య‌లో డ్రైవ‌ర్‌... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వెబ్ సిరీస్‌ను మించిన క్రైమ్ థ్రిల్ల‌ర్‌

Published : Jun 13, 2026, 05:49 PM IST

Andhra Pradesh: కడప జిల్లాలో యువకుడు వంశీ హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. మూడు రోజులుగా కనిపించకుండా పోయిన అతను మృతదేహంగా లభించడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో యజమాని కుటుంబంతో ఉన్న సంబంధాలపై కూడా విచారణ కొనసాగుతోంది. 

PREV
14
డ్రైవర్‌గా పనిచేసిన వంశీ

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం సిద్ధారెడ్డిగారిపల్లెకు చెందిన వంశీ కడపలో నివసించే రామసుబ్బారెడ్డి ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అదే కుటుంబానికి చెందిన పనులు చూస్తూ అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం.

24
కువైట్‌ నుంచి వచ్చిన యజమానికి పెరిగిన అనుమానాలు

జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన రామసుబ్బారెడ్డి ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ సమయంలో తన భార్య, డ్రైవర్ వంశీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అనుమానం అతనిలో పెరిగినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కుటుంబంలో పలుమార్లు వివాదాలు జరిగినట్లు తెలుస్తోంది.

34
అదృశ్యం.. ఆ తర్వాత మృతదేహం

కొన్ని రోజుల క్రితం వంశీ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఒంటిమిట్ట మండలం కోటపాడు సమీపంలోని ప్రాంతంలో అతని మృతదేహం లభించింది. శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో కీలకంగా మారిన కాల్ వివరాలు

వంశీ కనిపించకుండా పోయిన రోజు అతని కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదని సమాచారం. ఇదే సమయంలో యజమానిని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు కాల్ రికార్డులు, లొకేషన్ వివరాలను పరిశీలిస్తున్నారు.

44
యజమాని పాత్రపై పోలీసుల దృష్టి

హత్య వెనుక వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. యజమాని రామసుబ్బారెడ్డి పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories