Weather Update: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. మరోవైపు సూపర్ ఎల్‌నినో, వడదెబ్బల ముప్పు !

Published : May 18, 2026, 07:49 AM IST

Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు మండుతున్నాయి.. మరోవైపు వానలు పడుతున్నాయి. భానుడి భగభగలతో పాటు నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

PREV
15
డేంజర్ జోన్ లో తెలుగు రాష్ట్రాలు.. ఎల్‌నినో ఎఫెక్ట్ తో వానలు పడవా? అసలేమైంది?

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు చల్లని రుతుపవనాలు ఇటువైపు దూసుకొస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చింది. మనం అనుకున్నట్టే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్నాయి, కానీ అదే టైంలో ఎండలు కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది?

25
గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న నైరుతి రుతుపవనాలు

ఎండల దెబ్బకు తట్టుకోలేక ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని వెయిట్ చేస్తున్న వాళ్లకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆల్రెడీ అండమాన్ నికోబార్ దీవులను తాకేశాయి. అక్కడ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోకి మరింత విస్తరిస్తాయి.

అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 22 నుంచి 30 మధ్యలో, ముఖ్యంగా మే 26 నాటికి ఇవి కేరళను టచ్ చేస్తాయి. ఇక మన ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే.. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి సాధారణం కంటే కాస్త ముందే వర్షాలు పడేలా సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

35
అలర్ట్.. సూపర్ ఎల్‌నినో షాక్

రుతుపవనాలు వస్తున్నాయనే సంతోషంతో పాటు సూపర్ ఎల్‌నినో భయం కూడా మొదలైంది. పసిఫిక్ మహాసముద్రంలో నీళ్లు బాగా వేడెక్కుతుండటంతో ఈ పరిస్థితి వస్తోందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇది మనకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే, జూన్, జూలై నెలల్లో మనకు పీక్స్‌లో వర్షాలు పడాలి.

కానీ ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల పసిఫిక్ నుంచి వచ్చే వేడి గాలులు ఇండియా వైపు వస్తాయి. ఇవి తెలుగు రాష్ట్రాల్లోని తేమను లాగేస్తాయి. దీనివల్ల పడాల్సిన వర్షాలు పడకుండా డ్రై వెదర్ వచ్చే ప్రమాదం ఉంది. జూన్ మొదటి రెండు వారాలు వానలు పడినా, ఆ తర్వాత ఎల్‌నినో దెబ్బ కొట్టేలా ఉంది.

45
భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో మరణాలు

వర్షాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతానికైతే రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఈ వారమంతా ఎండలు భీభత్సంగా ఉండబోతున్నాయి. టెంపరేచర్స్ 40 నుంచి 45 డిగ్రీల వరకు టచ్ అవుతాయి. ఆల్రెడీ ఎండల తీవ్రతకు ఏపీలో నలుగురు, తెలంగాణలో పది మంది వడదెబ్బతో చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. మంగళవారం నాటికి దాదాపు 84 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

55
ఎక్కడెక్కడ వర్షాలు పడనున్నాయి?

అయితే ఈ ఎండల మధ్యలోనే అక్కడక్కడా రిలీఫ్ ఇచ్చేలా ద్రోణి ప్రభావంతో జల్లులు పడనున్నాయి. మే 19 నుంచి 21 మధ్య కోస్తాంధ్రా, రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.

అలాగే, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇక తెలంగాణలో చూస్తే సోమవారం పశ్చిమ తెలంగాణలో అక్కడక్కడా సాయంత్రం పూట చినుకులు పడొచ్చు. వెదర్ ఇలా క్రేజీగా మారబోతుండటంతో.. మే 18 నుంచి 22 వరకు మత్స్యకారులు ఎవరూ బంగాళాఖాతంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories