Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ ప్రాంతాలో భారీ వర్షాలు

Published : Sep 09, 2026, 07:58 AM IST

Weather Update: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో అల్పపీడనం బలపడుతోందనీ, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వాతావరణం మారిందని ఐఎండీ పేర్కొంది.

PREV
15
ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా రుతుపవనాలకు తగినట్టుగా వర్షాలు పడటం లేదు. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ అదిరిపోయే కూల్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, అలాగే ద్రోణి ప్రభావంతో రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 11 నాటికి పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వద్ద మరొక అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది.

25
అల్పపీడన వ్యవస్థలు, ద్రోణి ప్రభావం ఎంతంటే?

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. అయితే, తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఒక ద్రోణి సుదీర్ఘంగా కొనసాగుతోంది. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్రను ఆనుకుని బలమైన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ రెండింటి సంయుక్త ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడి, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

35
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను గాలులు, పిడుగుల ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించిన కథనం ప్రకారం, రాష్ట్రంలో పలు చోట్ల ఆకస్మిక ఈదురుగాలులతో పాటు తీవ్రమైన పిడుగులు పడే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటాయని తెలిపింది.

45
తెలంగాణకు ఎల్లో అలర్ట్: గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు

తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

55
నైరుతి రుతుపవనాల చివరి దశ, ఎల్ నినో ప్రభావం

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్ తుది దశకు చేరుకుంది. రుతుపవనాలు దేశం నుండి తిరోగమనం ప్రారంభించే ముందు సెప్టెంబర్ 12 నుంచి 21 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా వర్షాలు మళ్ళీ ఉంటాయని 'ఇన్శాట్-3డీఎస్' (INSAT-3DS) శాటిలైట్ చిత్రాల ఆధారంగా వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి.

ఈ ఏడాది బలపడుతున్న ఎల్ నినో కారణంగా వర్షాభావ రోజులు పెరిగి, దేశంలో కాలానుగుణ వర్షపాత లోటు సాధారణం కంటే దాదాపు 14 శాతం తక్కువగా నమోదైంది. జూన్ నుంచి ఆగస్టు వరకు సరైన వర్షాలు లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నిరాశలో ఉన్న రైతన్నలకు రాబోయే వర్షాలు తాత్కాలిక ఊరటనివ్వనున్నాయి. అకస్మాత్తుగా కురిసే వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories