ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూల్, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే, పిడుగులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది