సిద్ధార్థ్ ను చంపేసిన యూట్యూబ్ ఛానల్... పిర్యాదు చేసినా నో యూజ్!

By team teluguFirst Published Jul 19, 2021, 8:13 AM IST
Highlights

సిద్ధార్థ్ చనిపోయారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ తన థంబ్ నైల్ లో సిద్ధార్థ్ ఫోటో ఉంచింది. అతి తక్కువ వయసులో చనిపోయిన సౌత్ స్టార్స్ అంటూ సౌందర్య, ఆర్తి అగర్వాల్ ఫొటోలతో పాటు సిద్ధార్థ్ ఫోటో కూడా థంబ్ నైల్ లో ఉంచారు.

కోలీవుడ్ కి చెందిన సిద్దార్థ్ తెలుగులో కూడా భారీగా ఇమేజ్ తెచ్చుకున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బాయ్స్ మూవీ తరువాత తెలుగులో వరుసగా చిత్రాలు చేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు లవర్ బాయ్ గా సూపర్ పాప్యులర్ చేశాయి. అయితే ఆ తరువాత సిద్ధార్థ్ చేసిన సినిమాలు వరుస పరాజయాలు కావడంతో ఇక్కడ మార్కెట్ కోల్పోయారు. తమిళంలో మాత్రం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. 


ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సిద్దార్థ్... పొలిటికల్, సోషల్ ఇష్యూస్ పై స్పందిస్తూ ఉంటారు. అయితే సిద్ధార్థ్ చనిపోయారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ తన థంబ్ నైల్ లో సిద్ధార్థ్ ఫోటో ఉంచింది. అతి తక్కువ వయసులో చనిపోయిన సౌత్ స్టార్స్ అంటూ సౌందర్య, ఆర్తి అగర్వాల్ ఫొటోలతో పాటు సిద్ధార్థ్ ఫోటో కూడా థంబ్ నైల్ లో ఉంచారు. ఇది గమనించిన సిద్ధార్థ్ అభిమాని ఒకరు ఆ వీడియో సిద్ధార్థ్ కి ట్యాగ్ చేసి... వ్యూస్ కోసం యూట్యూబ్ వాళ్ళు మరీ ఇంతలా దిగజారుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. 


ఫ్యాన్ ట్వీట్ పై స్పందించిన సిద్దార్థ్... ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిందని, ఆ సమయంలో నేను యూట్యూబ్ కి కూడా ఫిర్యాదు చేశానని, అయినా ఆ వీడియోలో ఇబ్బందికర అంశం ఏమీ లేదంటూ యూట్యూబ్ వాళ్ళు సమాధానం ఇచ్చారంటూ కామెంట్ చేశారు. మరోవైపు మహాసముద్రం చిత్రం ద్వారా సిద్ధార్థ్ మరలా తెలుగులో స్ట్రైట్ మూవీ చేస్తున్నారు. శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. 
 

I reported to youtube about this video claiming I'm dead. Many years ago.

They replied "Sorry there seems to be no problem with this video".

Me : ada paavi 🥺 https://t.co/3rOUWiocIv

— Siddharth (@Actor_Siddharth)
click me!