Samantha: ముద్దు పెడుతూ బై బై చెబుతున్న సమంత.. నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

By team teluguFirst Published Jun 27, 2022, 8:34 AM IST
Highlights

సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనితో సామ్ ఫ్యాన్స్ ఓ సాలిడ్ మూవీని ఆశిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగా సమంత అదిరిపోయే ప్రాజెక్ట్స్ తో రాబోతోంది. 

సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'యశోద'. ఆగష్టులో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్యన విడుదలైన గ్లింప్ల్ ఆకట్టుకుంది. 

ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా వరలక్ష్మీ యశోద చిత్రం గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు వరలక్ష్మి పేర్కొంది. 'యశోద చిత్రంలో నానా పార్ట్ ముగిసింది. సమంతతో అద్భుతమైన టైం స్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉంది. నా దర్శకులు, డీఓపీతో ఈ చిత్ర షూటింగ్ సరదాగా సాగింది. మీరంతా ఈ చిత్రం చూసేందుకు ఎదురుచూస్తున్నా ' అంటూ వరలక్ష్మి చిన్న వీడియో పోస్ట్ చేసింది. 

ఈ వీడియోలో సమంత ముద్దు పెడుతూ వరలక్ష్మికి బై బై చెబుతోంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. థ్రిల్లింగ్ అంశాలతో ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలతో దర్శకులు తీర్చిదిద్దుతున్నారు. రావు రమేష్, సంపత్ రాజ్, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

click me!